నాలుగు ఓవర్లలోపే ఇంగ్లండ్.. | Sakshi
Sakshi News home page

నాలుగు ఓవర్లలోపే ఇంగ్లండ్..

Published Sun, Nov 27 2016 10:18 AM

నాలుగు ఓవర్లలోపే ఇంగ్లండ్..

మొహాలీ:భారత్ తో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్  93.5 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. 268/8 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ మరో 15 పరుగులు చేసి మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. దాంతో మూడొందల పరుగుల మార్కును చేరకుండానే ఇన్నింగ్స్ ముగించింది.


ఈరోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ నాలుగు ఓవర్లలోపే  చివరి రెండు వికెట్లను కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు రషిద్(4)ను మొహ్మద్ షమీ పెవిలియన్ కు పంపగా,  జేమ్స్ అండర్సన్(13 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. కాగా, జేమ్స్ అండర్సన్ తో కలిసి 15 పరుగులు భాగస్వామ్యం జత చేసిన తరువాత బాటీ(1)ని షమీ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో మొహ్మద్ షమీ మూడు వికెట్లు సాధించగా,  ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, జడేజాలకు తలో రెండు వికెట్లు దక్కాయి. అశ్విన్ కు వికెట్ దక్కింది.

Advertisement
Advertisement