ఇండోర్: న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరుగనున్న మూడో టెస్టుకు భారత ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు. కోల్ కతా లో ఈడెన్ గార్డెన్లో జరిగిన రెండో టెస్టులో గాయపడ్డ భువనేశ్వర్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తాజా ప్రకటనలో వెల్లడించింది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే ఇషాంత్ శర్మ టెస్టు సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇషాంత్ కు చికెన్ గున్యా సోకడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు భువీ కూడా మూడో టెస్టుకు దూరం కావడంతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలన్న భావిస్తున్న భారత జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
గత టెస్టు మ్యాచ్ లో ఆరు వికెట్లు సాధించి జట్టు విజయంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో కివీస్ వెన్నువిరిచిన భువీ.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీశాడు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు ఈనెల 8వ తేదీ నుంచి జరుగనుంది.
మూడో టెస్టుకు భువనేశ్వర్ దూరం
Published Thu, Oct 6 2016 1:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement