అమ్మ ఆరోగ్యం మెరుగైంది: ధావన్ | Sakshi
Sakshi News home page

అమ్మ ఆరోగ్యం మెరుగైంది: ధావన్

Published Tue, Sep 5 2017 12:55 PM

అమ్మ ఆరోగ్యం మెరుగైంది: ధావన్ - Sakshi

న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన చివరిదైన ఐదో వన్డేకు ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమైన సంగతి తెలిసిందే. తల్లికి అనారోగ్యంగా కారణంగా లంక పర్యటన నుంచి అర్ధాంతరంగా ముగించిన ధావన్ భారత్ కు వచ్చేశాడు.

లంక పర్యటన నుంచి వచ్చిన తరువాత ధావన్ తల్లి చెంతనే ఉంటూ ఆమె  ఆరోగ్యాన్ని చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తల్లి ఆరోగ్యం గత కంటే మెరుగైందంటూ ట్వీట్ చేశాడు. దానిలో భాగంగా తల్లితో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. 'అమ్మ కోలుకుంటోంది. గతం కంటే అమ్మ ఆరోగ్యం మెరుగైంది. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు' అని ధావన్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement