మళ్లీ టాప్-10లోకి పీవీ సింధు | Sakshi
Sakshi News home page

మళ్లీ టాప్-10లోకి పీవీ సింధు

Published Thu, Sep 4 2014 6:53 PM

మళ్లీ టాప్-10లోకి పీవీ సింధు

ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలలో ఇటీవలే కాంస్యపతకం సాధించిన భారత ఏస్ షట్లర్ పీవీ సింధు మళ్లీ టాప్-10 లోకి ప్రవేశించింది.  ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యుఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకింగులలో సింధు తన స్థానాన్ని రెండు ర్యాంకుల మేర మెరుగుపరుచుకుని పదో నెంబరులో నిలిచింది. సైనా నెహ్వాల్ ఎప్పటిలాగే 7వ ర్యాంకుతో తన స్థానంలో పదిలంగా ఉంది.

పురుషుల సింగిల్స్ విభాగంలో కిదాంబి శ్రీకాంత్ 22వ ర్యాంకులోను, పారుపల్లి కశ్యప్ 28వ ర్యాంకులోను ఉన్నారు. మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల, అశ్వనీ పొన్నప్పల జోడీ తమ 21వ స్థానాన్ని పదిలంగా ఉంచుకున్నారు.

Advertisement
Advertisement