శిఖర్ థావన్ ఒంటరి పోరు | Sakshi
Sakshi News home page

శిఖర్ థావన్ ఒంటరి పోరు

Published Sat, Dec 20 2014 8:21 AM

sikhar dhawan gets half century

బ్రిస్బేన్: టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైనా.. ఓపెనర్ శిఖర్ థావన్ మాత్రం ఒంటరి పోరు కొనసాగిస్తున్నాడు. 101 బంతుల్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న థావన్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.  అతనికి తోడుగా బౌలర్ ఉమేశ్ యాదవ్ (7) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.  వికెట్టు నష్టానికి 71 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాల్గో రోజు రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన టీమిండియా ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు.

 

లంచ్ సమయానికి ముందే టీమిండియా ఆటగాళ్లు ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ కు క్యూ కట్టారు. కోహ్లి ఒక్క పరుగు చేసి అవుటవ్వగా, రహానే పది పరుగులు చేశాడు. ధోని, రోహిత్ శర్మ లు డకౌట్ గా వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 408 పరుగులకు, ఆస్ట్రేలియా 505 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. ప్రస్తుతం టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్ మూడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించగా. అతనికి జతగా స్టార్క్ , హజిల్ వుడ్ లు చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.

Advertisement
Advertisement