⇒ప్రిక్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్, సాయిప్రణీత్
⇒సమీర్, సౌరభ్, జయరామ్ ఓటమి
⇒సింగపూర్ ఓపెన్ టోర్నీ
సింగపూర్ సిటీ: గతవారం మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే నిష్క్రమించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు... సింగపూర్ ఓపెన్లో మాత్రం అతికష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ సింధు 10–21, 21–15, 22–20తో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, ప్రపంచ 10వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై కష్టపడి గెలిచింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధు తొలి గేమ్లో తడబడింది. రెండో గేమ్లో ఒకదశలో స్కోరు 6–6 వద్ద ఉన్నపుడు ఈ హైదరాబాద్ అమ్మాయి ఒక్కసారిగా చెలరేగింది. వరుసగా తొమ్మిది పాయింట్లు నెగ్గి 15–6తో ముందంజ వేసింది. అదే జోరులో రెండో గేమ్ను సొంతం చేసుకొని మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో గేమ్లో సింధు ఆరంభంలో వరుసగా మూడు పాయింట్లు గెలిచి 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత ఒకుహారా తేరుకోవడంతో మ్యాచ్ పోటాపోటీగా సాగింది. స్కోరు 9–8 వద్ద ఉన్నపుడు సింధు విజృంభించి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 16–8తో విజయానికి చేరువైంది. స్కోరు 20–14 వద్ద సింధు విజయానికి ఒక పాయింట్ దూరంలో ఉన్నపుడు... ఒకుహారా వరుసగా ఆరు పాయింట్లు గెలిచి స్కోరును 20–20తో సమం చేసింది. అయితే సింధు ఒత్తిడికి లోనుకాకుండా వరుసగా రెండు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో సింధు, ఒకుహారా ముఖాముఖి రికార్డులో 3–3తో సమమయ్యారు. చివరిసారి వీరిద్దరూ 2016 రియో ఒలింపిక్స్ సెమీఫైనల్లో తలపడగా... సింధు పైచేయి సాధించింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫిత్రియాని (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. మహిళల సింగిల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్లో రితూపర్ణ దాస్ (భారత్) 18–21, 13–21తో సు యా చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది.
పురుషుల సింగిల్స్లో మిశ్రమ ఫలితాలు
మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. శ్రీకాంత్, సాయిప్రణీత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... సౌరభ్ వర్మ, సమీర్ వర్మ, అజయ్ జయరామ్ తొలి రౌండ్లో ఓడిపోయారు. బుధవారం జరిగిన తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–12, 21–11తో నిషిమోటో (జపాన్)పై, సాయిప్రణీత్ 17–21, 21–7, 21–19తో ఎమిల్ (డెన్మార్క్)పై గెలిచారు. సౌరభ్ వర్మ 15–21, 14–21తో ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా) చేతిలో, సమీర్ వర్మ 26–28, 21–23తో హు యున్ (హాంకాంగ్) చేతిలో, జయరామ్ 16–21, 7–21తో షి యుచి (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు.
మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం 21–19, 21–19తో యున్ లూ లిమ్–యాప్ చెంగ్ వెన్ (మలేసియా) జోడీపై గెలుపొందగా... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట 8–21, 16–21తో కమురా–సోనోడా (జపాన్) ద్వయం చేతిలో ఓడింది.
శ్రమించి నెగ్గిన సింధు
Published Thu, Apr 13 2017 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement