సత్తా చాటిన స్నేహ | Sakshi
Sakshi News home page

సత్తా చాటిన స్నేహ

Published Wed, Jan 22 2014 11:45 PM

sneha sucessful in All india ranking tennis tournment

జింఖానా, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి స్నేహ సత్తా చాటింది. సికింద్రాబాద్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ పోటీల్లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రె ండో సీడ్ స్నేహ 6-4, 6-1తో హర్యానా క్రీడాకారిణి ఆషిమా గార్గ్‌పై విజయం సాధించి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.
 
 ఇస్కా తీర్థ 6-3, 6-1తో అరంటాక్సా అండ్రెడి (ఢిల్లీ)పై నెగ్గగా, ఇస్కా అక్షర 6-1, 6-2తో మన రాష్ట్రానికే చెందిన శరణ్య నాగ్‌పాల్‌పై గెలుపొందింది. వైష్ణవి 6-0, 6-0తో విక్టోరియపై గెలవగా, నయనికా రెడ్డి 6-2, 6-1తో వానియా దంగ్వాల్ (ఢిల్లీ) చేతిలో ఓటమి చవిచూసింది. వైభవి త్రివేది (గుజరాత్) 6-3, 6-1తో ఆర్తి (తమిళనాడు)పై, అమృతా ముఖర్జీ (పశ్చిమ బెంగాల్) 6-0, 6-0తో నికు అమిన్ (గుజ రాత్)పై, రియా భాటియా (ఢిల్లీ) 6-2, 6-2తో శ్వేత (తమిళనాడు)పై నెగ్గి క్వార్టర్స్‌ఫైనల్స్‌కు చేరుకున్నారు.
 
 పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్
 షేక్ అబ్దుల్లా (ఏపీ) 6-2, 6-4తో పృథ్వి (తమిళనాడు)పై, శరణ్ రెడ్డి (ఏపీ) 7-6, 6-3తో ఆనంద్ (ఢి ల్లీ)పై, విజయ్ కణ్ణన్ (తమిళనాడు) 6-2, 6-2తో రోహిత్ సార్వతే (ఏపీ), వినోద్ శ్రీధ ర్ (తమిళనాడు) 6-1, 6-2తో సాయితేజస్ (ఏపీ), సూరజ్ దేశాయ్ 6-3, 4-6,6-4తో నిఖిల్ సాయి (ఏపీ)పై, లక్షిత్ సూద్ (ఉత్తరప్రదేశ్) 6-1, 4-6, 6-3తో సురభ్ సింగ్ (ఢిల్లీ)పై, అంకిత్ సచిదేవ్ (ఢిల్లీ) 6-3, 6-2తో సూరజ్ (కర్ణాటక)పై గెలుపొందారు.
 

Advertisement
Advertisement