ఢిల్లీ: దక్షిణాఫ్రికా మరోసారి తడబడింది. టీమిండియాతో ఇక్కడ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరుగుతున్న నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 121 పరుగులకే చాపచుట్టేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో ఎల్గర్(17), భవుమా(22), హషీమ్ ఆమ్లా(3), డు ప్లెసిస్(0), జేపీ డుమినీ(1), విలాస్(11) ,అబాట్(4), పీడిట్(5)లు నిరాశపరచగా, ఏబీ డివిలియర్స్(42) రాణించాడు. దక్షిణాఫ్రికా ఫాలో ఆన్ లో పడినా.. విరాట్ సేన కోరకపోవడంతో టీమిండియా శనివారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించనుంది. బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా వెన్నువిరచగా, ఉమేష్ యాదవ్, అశ్విన్ లకు తలో రెండు వికెట్లు, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు 231/7 ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన టీమిండియా 334 పరుగుల భారీ స్కోరు సాధించింది. అజింక్యా రహానే(127; 215 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) తో అద్భుత సెంచరీ చేశాడు. లంచ్ విరామ సమాయానికి మరో వికెట్ మాత్రమే కోల్పోయి, మరో 95 పరుగులను జత చేసింది. ఆ తరువాత స్వల్ప పరుగుల వ్యవధిలో మిగతా రెండు వికెట్లను భారత్ కోల్పోయింది.
సఫారీలకు రహానే-అశ్విన్ ల పరీక్ష
ఈ రోజు ఆటలో రహానే-అశ్విన్ ల జోడి సఫారీ బౌలర్లకు పరీక్షగా నిలిచింది . ఈ జోడి ఎనిమిదో వికెట్ కు 98 పరుగుల కీలక భాగస్వామ్యాన్నినెలకొల్పడంతో టీమిండియా పటిష్ట స్థితికి వెళ్లింది. ఈ క్రమంలోనే సఫారీలపై మొదటి శతకాన్ని, భారత్ లో తొలి సెంచరీని సాధించిన రహానే తన దూకుడును మరింత పెంచాడు. డేన్ పీడిట్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు సాధించి మంచి ఊపులో కనిపించాడు. అయితే రహానే సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత మరో 27 పరుగులు చేసి ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత అశ్విన్ (56; 140 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ సాధించాడు. ఉమేష్ యాదవ్(10నాటౌట్) తో కలిసి అశ్విన్ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే 334 పరుగుల వద్ద అశ్విన్ తొమ్మిదో వికెట్ గా అవుటవ్వగా, వెంటనే ఇషాంత్ శర్మ డకౌట్ పెవిలియన్ కు చేరడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
సఫారీలు మరో'సారీ'
Published Fri, Dec 4 2015 4:41 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement