బిజ్నూరు: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాడు. అంతర్జాతీయ వేదికలపై గెలిచి దేశానికి పలు పతకాలు అందించాడు. అయినా ఈ యువ క్రీడాకారుడిని ప్రోత్సహించేవారే కరువయ్యారు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కెరీర్ కొనసాగించడానికి కిడ్నీని వేలానికి పెట్టాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన స్క్వాష్ క్రీడాకారుడు 20 ఏళ్ల రవి దీక్షిత్ దయనీయ పరిస్థితి ఇది.
జూనియర్ స్థాయి నుంచే గత పదేళ్లుగా రవి దీక్షిత్ ఆడుతున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010 ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో స్వర్ణ పతకం సాధించాడు. ఇంకా ఎన్నో పతకాలు సాధించాడు. అయినా అతణ్ని ఎవరూ ప్రోత్సహించలేదు. శిక్షణ కోసం, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు అయ్యే ఖర్చులు భరించలేని పరిస్థితి. వచ్చే నెలలో జరిగే దక్షిణాసియా గేమ్స్లో పాల్గొనేందుకు తగినంత డబ్బు అందుబాటులో లేదు. స్క్వాష్ క్రీడపై మక్కువతో, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే పట్టుదలతో, కెరీర్ కొనసాగించిందుకు కిడ్నీని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టాడు. ఆసక్తి గల వారు సంప్రదించాలని కోరాడు.
'దమ్పూర్ సుగర్ మిల్ నాకు సాయం చేస్తోంది. అయితే వాళ్లు ఎంతకాలమని సాయం చేస్తారు? గువహటిలో జరిగే దక్షిణాసియా గేమ్స్లో భారత్ తరపున ఆడాలి. ఈ టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు చెన్నైలో శిక్షణ పొందాలి. ఇందుకు తగినంత డబ్బు నా దగ్గర లేదు. ఇందుకోసం కిడ్నీ అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా. కావాల్సినవారు సంప్రదించండి. కిడ్నీ ధర 8 లక్షల రూపాయలు' అని ఫేస్బుక్లో రవి దీక్షిత్ పోస్ట్ చేశాడు. ఈ వార్త తెలియగానే అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రవి తండ్రి రామకైలాస్ దీక్షిత్ నాలుగో తరగతి ఉద్యోగి. ఆయన జీతంలో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. రవి సంపాదించిన డబ్బుతో తన కుమార్తెకు పెళ్లి చేశానని, అతనికి ఆర్థిక సాయం చేయలేని స్థితిలో ఉన్నానని, కిడ్నీ అమ్మాలన్న నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా చెప్పానని రామకైలాస్ దీక్షిత్ చెప్పాడు.
రవి కిడ్నీ అమ్మకం వార్త విని పలువురు స్పందించారు. అతనికి ఎప్పుడూ అండగా ఉంటామని, తమను సంప్రదించాలని సుగర్ మిల్ యాజమాన్యం సూచించింది. యూపీ మంత్రి మూల్చంద్ చౌహాన్ స్పందిస్తూ.. ఈ విషయం విని షాకయ్యానని, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో చర్చించి రవికి సాయం చేస్తామని, త్వరలో అతని కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. యూపీ ప్రభుత్వం ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడం లేదని, రవి లాంటి క్రీడాకారులకు సాయం చేయడం బాధ్యతని దమ్పూర్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కుమార్ రాణా వ్యాఖ్యానించారు.
కెరీర్ కోసం కిడ్నీని వేలానికి పెట్టాడు..
Published Tue, Jan 12 2016 3:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement