మరోసారి ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్ | Sakshi
Sakshi News home page

మరోసారి ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్

Published Wed, Sep 14 2016 12:35 AM

మరోసారి ఫీల్డింగ్ కోచ్‌గా శ్రీధర్

ముంబై: న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌కు భారత ఫీల్డింగ్ కోచ్‌గా మరోసారి ఆర్.శ్రీధర్‌ను నియమించారు. ఇటీవలి కరీబియన్ పర్యటనలో ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన అభయ్ శర్మకు ఉద్వాసన పలికారు. సోమవారం జరిగిన టెస్టు జట్టు ఎంపిక సందర్భంగా విండీస్ పర్యటనపై కోచ్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లితో కలిసి బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే రివ్యూ జరిపారు. వారిద్దరి సూచనల మేరకు శ్రీధర్‌కు పిలుపు అందింది. గతంలో శ్రీధర్ జాతీయ జట్టుకు సేవలందించగా టి20 ప్రపంచకప్ అనంతరం ఆయన ఒప్పందం ముగిసింది.

Advertisement
Advertisement