ఫైనల్లో శ్రీకాంత్కు చుక్కెదురు | Sakshi
Sakshi News home page

ఫైనల్లో శ్రీకాంత్కు చుక్కెదురు

Published Sun, Dec 6 2015 4:24 PM

ఫైనల్లో శ్రీకాంత్కు చుక్కెదురు

మలాంగ్: ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్ ప్రీగోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్లో భారత నంబర్వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పరాజయం పాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో శ్రీకాంత్పై 21-17, 13-21, 22-24 తేడాతో ఇండోనేసియా ఆటగాడు టామీ సుగియార్తో గెలుపొందాడు.

తొలి సెట్లో ప్రదర్శించిన జోరును రెండో, మూడో సెట్లలో కనబరచక పోవడంతో ఓటమి పాలైయ్యాడు. సుమారు గంట పాటు జరిగిన మ్యాచ్లో నెట్ వద్ద అనవసర తప్పిదాలు చేసిన ప్రపంచ నంబర్ 9వ ఆటగాడు శ్రీకాంత్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఓవరాల్గా  సుగియార్తోతో మూడు మ్యాచ్ల్లో తలపడగా శ్రీకాంత్ ఒక మ్యాచ్ గెలిచి, రెండు మ్యాచ్ల్లో ఓటమిచెందాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement