పోరాడుతున్న లంక | Sakshi
Sakshi News home page

పోరాడుతున్న లంక

Published Fri, Aug 21 2015 3:14 PM

పోరాడుతున్న లంక - Sakshi

కొలంబో: భారత్తో రెండో టెస్టులో శ్రీలంక్ పోరాడుతోంది. మ్యాచ్ రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంకేయులు టీ విరామానికి వికెట్ నష్టానికి 65 పరుగులు చేశారు. ఓపెనర్ కరుణరత్నే ఒక్క పరుగుకే అవుటయ్యాడు. భారత పేసర్ ఉమేష్ యాదవ్ ఆరంభంలోనే కరుణరత్నేను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కౌశల్ సిల్వా (30 బ్యాటింగ్)కు సంగక్కర (29 బ్యాటింగ్)  అండగా నిలిచి టీ విరామానికి మరో వికెట్ నష్టపోకుండా పరిస్థితి చక్కదిద్దాడు.

అంతకుముందు 319/6 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 393 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (108) సెంచరీకి తోడు రోహిత్ శర్మ (79), విరాట్ కోహ్లీ (78), సాహా (56) హాఫ్ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లు హెరాత్ 4, మాథ్యూస్, దమ్మిక ప్రసాద్, చమీర రెండేసి వికెట్లు పడగొట్టారు.

Advertisement
Advertisement