ప్రపంచకప్ గ్రూప్ ఏ లో భాగంగా గురువారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 333 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ దిల్షాన్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేయగా, ఫస్ట్ డౌన్ లో క్రీజ్ లోకి వచ్చిన సంగక్కర కూడా పరుగుల వరదను పారించాడు.
146 బంతులాడిన దిల్షాన్ 22 ఫోర్ల సాయంతో 161 పరుగులు చేశాడు. ధాటిగా ఆడి 105 పరుగులు చేసిన సంగక్కర అందుకోసం కేవలం 76 బంతులు మాత్రమే తీసుకోవడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. మొదటి ఓవర్ నుంచి నిలకడైన ఆటతీరును ప్రదర్శించింది. మరో ఓపెనర్ తిరిమన్నే 78 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో రూబెల్ హుస్సేన్ మాత్రమే ఒక్క వికెట్ తీయగలిగాడు.