శ్రీలంక ఘనవిజయం | Sakshi
Sakshi News home page

శ్రీలంక ఘనవిజయం

Published Mon, May 26 2014 1:11 AM

శ్రీలంక ఘనవిజయం - Sakshi

157 పరుగులతో ఇంగ్లండ్ ఓటమి
 చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్ చేతిలో తొలి వన్డేలో ఎదురైన ఓటమికి శ్రీలంక దీటైన జవాబిచ్చింది. దిల్షాన్ (101 బంతుల్లో 88; 7 ఫోర్లు) భారీ అర్ధసెంచరీకి తోడు బౌలర్లంతా సమష్టిగా రాణించడంతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో 157 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
 
  ప్రియంజన్ (33 బంతుల్లో 43), సంగక్కర (40) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో విఫలమైన ఇంగ్లండ్ 26.1 ఓవర్లలోనే 99 పరుగులకే కుప్పకూలింది. తాత్కాలిక కెప్టెన్ మోర్గాన్ (40) మినహా... లంక బౌలర్ల ధాటికి ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేకపోయారు. కులశేఖర (3/15) మూడు వికెట్లతో టాపార్డర్‌ను కూల్చగా, సేననాయకే (4/13) నాలుగు వికెట్లతో మిగిలిన పనిని పూర్తి చేశాడు. దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మూడో మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement