ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ | Sakshi
Sakshi News home page

ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్

Published Fri, May 6 2016 7:44 PM

sun risers hyderabad won the toss and elected to field first

మాడ్రిడ్:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా శుక్రవారం ఇక్కడ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

 

ఇప్పటివరకూ గుజరాత్ తొమ్మిది మ్యాచ్లాడిన గుజరాత్ ఆరింట గెలవగా, సన్ రైజర్స్ ఏడు మ్యాచ్లకు గాను నాలుగు నెగ్గింది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

 

గుజరాత్ తుది జట్టు: అరోన్ ఫించ్, డ్వేన్ స్మిత్, బ్రెండన్ మెకల్లమ్, సురేష్ రైనా(కెప్టెన్), దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, బ్రేవో, సంగ్వాన్, ప్రవీణ్ కుమార్, ధావల్ కులకర్ణి, కౌశిక్

హైదరాబాద్ తుది జట్టు:డేవిడ్ వార్నర్(కెప్టెన్), శిఖర్ ధవన్, విలియమ్సన్, యువరాజ్ సింగ్, హెన్రీక్యూస్, నమాన్ ఓజా, హూడా, భువనేశ్వర్ కుమార్, బరిందర్ శ్రవణ్, ఆశిష్ నెహ్రా, ముస్తిఫిజుర్ రెహ్మాన్

Advertisement
Advertisement