ఐఎస్‌ఎల్ వేలానికి చెత్రి | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్ వేలానికి చెత్రి

Published Fri, Jun 12 2015 1:13 AM

Sunil chhetri in ISL auction

ముంబై : భారత స్టార్ ఫుట్‌బాలర్ సునీల్ చెత్రితో పాటు మరో తొమ్మిది మంది ఆటగాళ్లు.. ఐఎస్‌ఎల్ వేలానికి అందుబాటులో ఉండనున్నారు. జూలై 10న ఈ వేలం జరగనుంది. చెత్రి కనీస విలువ రూ. 80 లక్షలు కాగా గోల్ కీపర్ కరణ్‌జీత్ సింగ్ కనీస ధర రూ. 60 లక్షలు. మొత్తం 8 ఫ్రాంచైజీలు ఈ వేలంలో ఆటగాళ్ల కోసం పోటీ పడనున్నాయి. గతేడాది ఐ-లీగ్ క్లబ్స్‌తో ఉన్న వ్యక్తిగత ఒప్పందం మేరకు చెత్రి వేలానికి అందుబాటులో ఉండలేదు. అయితే ఈసారి వేలంపై ఈ యువ స్ట్రయికర్ ఆసక్తి కనబరుస్తున్నాడు. రాబిన్ సింగ్, ఆర్తజా ఇజుమి, అనాస్‌లు రూ. 40 లక్షల బేస్ ప్రైస్‌తో; తోయ్ సింగ్ రూ. 39 లక్షలు, ఎగున్‌సెన్ లింగ్డో రూ. 27.50 లక్షల కనీస ధరతో వేలానికి వస్తున్నారు.

Advertisement
Advertisement