కార్డిఫ్: సురేష్ రైనా (75 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 100) మెరుపు సెంచరీతో కదం తొక్కడంతో ఇంగ్లండ్తో రెండో వన్డేలో భారత్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ధోనీసేన పూర్తి ఓవర్లలో ఆరు వికెట్లకు 304 పరుగులు చేసింది. ధోనీ (52), రోహిత్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత్ ఆరంభంలో 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ధవన్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా, విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. వోక్స్ ఒకే ఓవర్లో వీరిద్దరినీ అవుట్ చేశాడు. ఈ దశలో రోహిత్, రహానె జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్కు 91 పరుగులు జోడించారు. కాగా హాఫ్ సెంచరీకి చేరువలో రహానె (41) అవుటవగా, రోహిత్ (52) హాఫ్ సెంచరీ చేసిన వెంటనే వెనుదిరిగాడు. భారత్ 32 ఓవర్లలో నాలుగు వికెట్లకు 140 పరుగులు చేసింది. ఈ దశలో స్కోరు 250 దాటడం కష్టమనిపించింది. అయితే రైనా రెచ్చిపోవడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ధోనీ అండగా నిలవడంతో రైనా ఫోర్లు, సిక్సర్లతో విజృంభించాడు. 49 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రైనా మరో 25 బంతుల్లో సెంచరీ పూర్తి చేయడం విశేషం. కాగా సెంచరీ చేసిన రైనా వెనుదిరిగాడు. ధోనీ కూడా హాఫ్ సెంచరీ చేసిన అనంతరం అవుటయ్యాడు. అయితే భారత్ అప్పటికే భారీ స్కోరు సాధించింది. జడేజా, అశ్విన్ స్కోరును 300 మార్క్ దాటించారు.
రెచ్చిపోయిన రైనా.. భారత్ భారీ స్కోరు
Published Wed, Aug 27 2014 7:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement