రాహుల్ ఒంటరి పోరాటం | Sakshi
Sakshi News home page

రాహుల్ ఒంటరి పోరాటం

Published Sat, Mar 4 2017 2:23 PM

రాహుల్ ఒంటరి పోరాటం

బెంగళూరు: ఆస్ట్రేలియాతో ఇక్కడ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ టీ విరామానికి ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్‌ (79), అశ్విన్ (5) క్రీజులో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాహుల్ మినహా టాపార్డర్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. రాహుల్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్ (0) డకౌటయ్యాడు. కెప్టెన్ కోహ్లీ కూడా 12 పరుగులకే వెనుదిరిగాడు. పుజారా, రహానె చెరో 17 పరుగులు చేశారు. వీరితో పోలిస్తే కరుణ్‌ నాయర్ (26) కాస్త నయమనిపించాడు. ఆసీస్ బౌలర్ నాథన్ లియాన్ మూడు వికెట్లు పడగొట్టాడు.

Advertisement
Advertisement