నిలకడగా టీమిండియా బ్యాటింగ్ | Sakshi
Sakshi News home page

నిలకడగా టీమిండియా బ్యాటింగ్

Published Thu, Oct 22 2015 2:57 PM

team india gets 104 runs and lose 2 wickets after 20 overs

చెన్నై:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 104 పరుగులతో టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే రోహిత్ శర్మ(21), శిఖర్ ధవన్ (7) వికెట్లను కోల్పోయింది.

 

అనంతరం ఫస్ట్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లి, సెకెండ్ డౌన్  లో వచ్చిన అజింక్యా రహానేలు జట్టుకు మరమ్మత్తులు చేపట్టారు. ఈ క్రమంలోనే 20 ఓవర్ దాటిన అనంతరం కోహ్లి(50) హాఫ్ సెంచరీ చేయగా, అతనికి జతగా రహానే (25) క్రీజ్ లో ఉన్నాడు.

 

 

Advertisement
Advertisement