బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Published Thu, Oct 22 2015 1:44 PM

team india won the toss and elected to bat first

చెన్నై:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బ్యాటింగ్ ను రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ లు ఆరంభించారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా 1-2 తేడాతో వెనుకబడిన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో గెలిచితీరాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సిరీస్ ను సమం అవుతుంది. లేకుంటే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను సఫారీలకు సమర్పించుకోక తప్పదు.

చెన్నై వన్డేలో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసి, తద్వారా సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ధోనీసేన ఆరాటపడుతోంది. ఈ మ్యాచ్ టీమిండియాతో పాటు కెప్టెన్గా ధోనీకి ఎంతో కీలకం. నిలకడలేమి వల్ల గెలవాల్సిన మ్యాచ్ల్లో చేజేతులా ఓడిపోతున్నారు. తొలి, మూడో వన్డేల్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత్ ఓటమి చవిచూసింది.

 

 

Advertisement
Advertisement