రన్నరప్ తెలంగాణ | Sakshi
Sakshi News home page

రన్నరప్ తెలంగాణ

Published Mon, Jan 16 2017 11:42 AM

రన్నరప్ తెలంగాణ

పుదుచ్చేరి: సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ రైల్వేస్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించిన తెలంగాణ మహిళల జట్టు తుది పోరులో మాత్రం తడబడింది. జాతీయ సీనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఇక్కడ జరిగిన ఫైనల్లో తెలంగాణ 59-68తో కేరళ జట్టు చేతిలో పోరాడి ఓడిపోయింది. తెలంగాణ తరఫున ఎం.గాయత్రి 16 పారుుంట్లు సాధించగా... విజేత జట్టు తరఫున పి.ఎస్. జీనా 20 పారుుంట్లు చేసింది. పురుషుల ఈవెంట్‌లో ఉత్తరాఖండ్ 68-60తో తమిళనాడుపై విజయం సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు అందజేశారు. ఇందులో పుదుచ్చేరి సీఎం వి. గవే పాల్గొన్నారు.


 

Advertisement

తప్పక చదవండి

Advertisement