తమిళనాడుపై తెలంగాణ గెలుపు | Sakshi
Sakshi News home page

తమిళనాడుపై తెలంగాణ గెలుపు

Published Tue, Oct 4 2016 11:29 AM

telangana beats tamil nadu in basket ball championship

జాతీయ సబ్ జూ. బాస్కెట్‌బాల్ టోర్నీ


 సాక్షి, హైదరాబాద్: జాతీయ సబ్-జూనియర్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలుర జట్టు తమిళనాడుపై విజయం సాధించింది. సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ లీగ్ మ్యాచ్‌లో తెలంగాణ 76-37తో తమిళనాడుపై సునాయాస విజయం సాధించింది. తెలంగాణ జట్టు తరఫున హర్ష్ హుడా 20, షోయబ్ ఖాన్ 10, ప్రశాంత్ 8 పాయింట్లు చేశారు. తమిళనాడు జట్టులో ఆర్.హరీశ్ 14, ఎస్. హరీశ్ 12 పాయింట్లు సాధించారు. గ్రూప్‌‘ఎ’లో జరిగిన పోరులో ఆంధ్రప్రదేశ్ జట్టు 32-61 స్కోరు తేడాతో మధ్యప్రదేశ్ చేతిలో ఓడింది.

 

ఏపీ తరఫున షేక్ అహ్మద్ 8, రమణ 6 పారుుంట్లు చేయగా, మధ్యప్రదేశ్ జట్టులో బ్రిజేశ్ తివారి (20), విరాట్ ధకడ్ (11), సచిన్ తాపా (10) రాణించారు. మిగతా మ్యాచ్‌ల్లో ఓడిశా 64-26తో కేరళపై, మహారాష్ట్ర 67-59తో కర్ణాటకపై, హరియాణా 48-25తో చత్తీస్‌గఢ్‌పై, చండీగఢ్ 58-50తో హిమాచల్ ప్రదేశ్‌పై, పశ్చిమ బెంగాల్ 50-48తో గుజరాత్‌పై, ఉత్తరాఖండ్ 51-20తో పుదుచ్చేరిపై, పంజాబ్ 55-10తో గోవాపై, ఢిల్లీ 71-63తో బీహార్‌పై గెలుపొందారుు. బాలికల విభాగంలో తెలంగాణ జట్టుకు 32-52తో కేరళ చేతిలో పరాజయం ఎదురైంది. మిగతా మ్యాచ్‌ల్లో కర్ణాటక 47-33తో హరియాణాపై, చత్తీస్‌గఢ్ 52-40తో కర్ణాటకపై, మధ్యప్రదేశ్ 29-23తో హరియాణాపై, కేరళ 40-38తో ఉత్తరప్రదేశ్‌పై, ఢిల్లీ 49-25తో హిమాచల్ ప్రదేశ్‌పై, పశ్చిమ బెంగాల్ 29-1తో జమ్మూకశ్మీర్‌పై, పంజాబ్ 34-20తో జార్ఖండ్‌పై, ఆంధ్రప్రదేశ్ 44-8తో ఓడిశాపై, చండీగఢ్ 37-18తో ఉత్తరాఖండ్‌పై విజయం సాధించాయి.

 

Advertisement
Advertisement