హారికకు పదో స్థానం | Sakshi
Sakshi News home page

హారికకు పదో స్థానం

Published Tue, Apr 29 2014 1:45 AM

హారికకు పదో స్థానం

 ఖాంటీమన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ బ్లిట్జ్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక పదో స్థానంలో నిలిచింది. 34 మంది క్రీడాకారిణులు బరిలోకి దిగిన ఈ పోటీల్లో నిర్ణీత 30 రౌండ్లు ముగిశాక హారిక 16.5 పాయింట్లు సాధించింది. చివరిరోజు సోమవారం హారిక ఒక్క గేమ్‌లోనూ విజయం సాధించలేకపోయింది. 23 పాయింట్లు సాధించిన అనా ముజిచుక్ (స్లొవేనియా) విజేతగా నిలిచింది. నానా జాగ్‌నిజ్దె (జార్జియా-20.5 పాయింట్లు) రజతం... తాతియానా కొసిన్‌త్సెవా (రష్యా-20 పాయింట్లు) కాంస్యం గెలిచారు.
 

Advertisement
Advertisement