ఆనంద్‌కు మూడో గెలుపు | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మూడో గెలుపు

Published Sun, Apr 26 2015 1:30 AM

ఆనంద్‌కు మూడో గెలుపు

షామ్‌కిర్ (అజర్‌బైజాన్) : వుగార్ గషిమోవ్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ మూడో విజయం సాధించాడు. మమెదైరోవ్ (అజర్‌బైజాన్)తో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 38 ఎత్తుల్లో గెలిచాడు. ఈ విజయంతో ఆనంద్ పాయింట్ల పట్టికలో 5.5 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. దాంతోపాటు మరోసారి 2800 ఎలో రేటింగ్‌ను అందుకొని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకున్నాడు.

Advertisement
Advertisement