వడోదర: ఐపీఎల్ బెట్టింగ్కు పాల్పడి పోలీసుల చేతిలో అరెస్టయిన భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ అరోథే తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. తానెప్పుడూ ఎలాంటి తప్పుడు పనులకు పాల్పడలేదని ఆయన వివరణ ఇచ్చారు. బెట్టింగ్ అభియోగంపై తుషార్తో పాటు మరో 18 మందిని బరోడా పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయగా...ఆ తర్వాత వారు బెయిల్పై విడుదలయ్యారు. అనంతరం ఈ ఘటనపై తుషార్ స్పందించారు. ‘క్రికెట్ నా జీవనాధారం. ఇవాళ నాకు ఈ మాత్రం పేరు వచ్చి ఈ స్థితిలో ఉన్నానంటే అందుకు క్రికెట్టే కారణం. నేనెప్పుడూ అలాంటి తప్పుడు పని చేయను. చేయడం సంగతేమో కానీ కనీసం ఆలోచించను కూడా. జీవితంలో ఒక్క పైసా విషయంలో కూడా ఎవరినీ మోసం చేయలేదు’ అని అరోథే వ్యాఖ్యానించారు.
Related news
-
IPL 2024: వరుసగా ఓడిపోతున్నా పంజాబ్ బౌలర్లను మించిన తోపులు లేరు..!
బ్యాటర్ల హవా కొనసాగుతున్న ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ బౌలర్లు ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు (41 మ్యాచ్లు) జరిగిన మ్యాచ్ల్లో పంజాబ్ ఒక్కటే ఒక్కసారి కూడా ప్రత్యర్దిని 200 పరుగులు చేయనీయలేదు. ఈ సీజన్లో పంజాబ్ బౌలింగ్ యావరేజ్ 24.94గా ఉంది. ఏ జట్టుకు ఈ సీజన్లో ఇంత తక్కువ బౌలింగ్ సగటు లేదు. పంజాబ్ తర్వాత కేకేఆర్కు అత్యల్ప బౌలింగ్ సగటు (25.47) ఉంది. పంజాబ్ ఈ సీజన్లో అత్యధికంగా 199 పరుగులు ప్రత్యర్దికి సమర్పించుకుంది. ఇలా రెండు సందర్భాల్లో జరిగింది. ఇదిలా ఉంటే, పంజాబ్ ఇవాళ (ఏప్రిల్ 26) పటిష్టమైన కేకేఆర్ను వారి సొంత మైదానంలో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పంజాబ్కు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్స్ లెక్కల్లో ఉంటుంది. లేకపోతే మరో సీజన్లో ఈ జట్టు టైటిల్ లేకుండా రిక్త హస్తాలతో వైదొలగాల్సి ఉంటుంది. పంజాబ్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు కేకేఆర్ ఏడింట ఐదు మ్యాచ్లు గెలిచి రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్లో కేకేఆర్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ మూడో టైటిల్ దిశగా అడుగులు వేస్తుంది.ఇరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. పంజాబ్పై కేకేఆర్కు స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి.తుది జట్లు..కోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, దుష్మంత చమీర, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణాపంజాబ్ కింగ్స్: జానీ బెయిర్స్టో, సామ్ కర్రన్(కెప్టెన్), రిలీ రోసోవ్, జితేష్ శర్మ(వికెట్కీపర్), శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ -
SRH vs RCB: ఉప్పల్లో 300 కొడతారా..!
సాక్షి, హైదరాబాద్: 266... 277... 287... ఇదంతా ఒకే ఐపీఎల్ సీజన్లో, ఒకే టీమ్, వేర్వేరు మ్యాచ్లలో చేసిన పరుగుల విధ్వంసం. విశేషం ఏమిటంటే ఈ 287 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు. ఈ పరుగుల సునామీ సృష్టించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కాగా... ఇందులో 277 పరుగులు నమోదు చేసింది నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగానే.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈసారి ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్లో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ‘ఢీ’ కొట్టనుంది. 10 రోజుల క్రితం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ జట్టు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ (262/7) చేధించినంత పనిచేసింది. ఈ ఇరు జట్లే మళ్లీ నేడు తలపడనుండటంతో క్రికెట్ అభిమానుల చూపంతా ఈ మ్యాచ్పైనే ఉంది. ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకోనుందా? హైదరాబాద్ తన హవాను కొనసాగించనుందా? అనే ఆసక్తికి ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ చేరే అవకాశాలు ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఆడుతున్న ‘లోకల్ బాయ్’ మొహమ్మద్ సిరాజ్, భారత స్టార్ విరాట్ కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ చెలరేగితే సన్రైజర్స్ స్కోరు ఈసారి 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సన్రైజర్స్ భీకరమైన ఫామ్లో ఉండటం... కోహ్లిలాంటి దిగ్గజం బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ సీజన్లోని గత మ్యాచ్ల్లాగే ఈసారీ అభిమానులకు టికెట్ల ఇక్కట్లు తప్పట్లేదు. ఆన్లైన్లో టిక్కెట్లు క్షణాల్లో అయిపోవడంతో చేసేదేమిలేక క్రికెట్ అభిమానులంతా బిగ్ స్క్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పలు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. 🧡❤️ pic.twitter.com/3ho5bxzGSZ— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2024 -
IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టనున్న శుభ్మన్ గిల్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ (ఏప్రిల్ 24) జరుగబోయే మ్యాచ్తో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయిని తాకనున్నాడు. ఈ మ్యాచ్ గిల్కు ఐపీఎల్లో 100వ మ్యాచ్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 64 మంది 100 మ్యాచ్లు ఆడగా.. గిల్ 65వ ఆటగాడు కానున్నాడు.2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్న గిల్.. 2021 వరకు కేకేఆర్ తరఫున, ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్నాడు. గిల్ తన 99 మ్యాచ్ల కెరీర్లో 135.2 స్ట్రయిక్రేట్తో 38.1 సగటున 3088 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.2022 సీజన్ టైటిల్ విన్నింగ్ జట్టులో (గుజరాత్) భాగమైన గిల్.. 2023 సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్తో జరిగిన నాకౌట్లో గిల్ మెరుపు సెంచరీతో మెరిశాడు.కాగా, నేటి మ్యాచ్లో గుజరాత్ ఢిల్లీని వారి సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.ఢిల్లీతో పోలిస్తే గుజరాత్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ల్లో నాలుగింట గెలిచి 8 పాయింట్లు కూడగట్టుకుంది. ఢిల్లీ ఎనిమిదిలో మూడు మ్యాచ్లు మత్రమే గెలిచి ఆరు పాయింట్లతో గుజరాత్ కంటే వెనుకపడింది. ప్లే ఆఫ్స్కు చేరాలంటే ఇరు జట్లకు ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. గుజరాత్కు ఓ మ్యాచ్ అటో ఇటో అయినా ఢిల్లీ మాత్రం అన్ని మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ల్లో తలపడగా.. చెరి రెండు మ్యాచ్లు గెలిచాయి. ఢిల్లీ గెలుపొందిన రెండు మ్యాచ్లు గుజరాత్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్లోనే కావడం విశేషం. -
SRH Vs RCB: ఐపీఎల్ ఫీవర్... హోటల్ రెంట్లు డబుల్!
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫీవర్తో హైదరాబాద్లోని స్టార్ హోటళ్ల గదుల అద్దెలకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు అన్ని స్టార్ హోటళ్లు బుక్ అయిపోయాయి. దీనికితోడు రేట్లు కూడా సాధారణం కంటే రెట్టింపు అంతకంటే ఎక్కువయ్యాయి. హోటల్ గదులు బుక్ చేసుకోవడానికి ఉపకరించే ప్రముఖ వెబ్సైట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)–రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య ఫేవరేట్ మ్యాచ్ జరుగనుండటంతో పాటు పెళ్లి ముహూర్తాలు కూడా ఉండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అత్యధిక స్కోర్లతో హాట్ ఫేవరేట్లుగా... ప్రసుత్తం ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్–ఆర్సీబీ జట్లు హాట్ ఫేవరెట్స్గా మారిపోయాయి. ఈ రెండింటి మధ్య ఈ నెల 15న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కేంద్రంగా ఓ మ్యాచ్ జరిగింది. అందులో ఎస్ఆర్హెచ్ 287, ఆర్సీబీ 262 పరుగులు చేసి రికార్డు సృష్టించాయి. ఐపీఎల్ చరిత్రలోనే ఇవి అత్యధిక స్కోర్లు కావడంతో ఈ రెండు జట్ల పైనా ఐపీఎల్ ప్రియులకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలోనూ ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆయా జట్లు హైదరాబాద్ చేరుకున్నాయి. వీరి కోసం రెండు స్టార్ హోటళ్లలో చాలా భాగం నిర్వాహకులు బుక్ చేశారు. దీంతో పాటు ఈ మ్యాచ్ను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి అనేక మంది క్రికెట్ అభిమానులు వస్తున్నారు. వీళ్లు సైతం ఆన్లైన్లో, ప్రముఖ వెబ్సైట్లు, యాప్ల ద్వారా స్టార్ హోటళ్లలో గదులు బుక్ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే హైదరాబాద్లోని అనేక స్టార్ హోటళ్లలో శుక్రవారం వరకు గదులు ఖాళీ లేవని ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. సరాసరిని మించిన బుకింగ్... హోటళ్లల్లో గదులు బుక్ కావడం, అందులో అతిథులు బస చేయడాన్ని ఆక్యుపెన్సీగా పిలుస్తారు. స్టాటిస్టా సంస్థ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని స్టార్ హోటళ్లల్లో ఆక్యుపెన్సీ రేటు సరాసరి గరిష్టంగా 50 నుంచి 60 శాతం మాత్రమే ఉంటోంది. 2021–22 ఆరి్థక సంవత్సరంలో ఇది 51 శాతంగా, 2022–23 ఆరి్థక సంవత్సరంలో 73 శాతంగా నమోదైంది. అయితే ఐపీఎల్ మ్యాచ్తో పాటు పెళ్లి ముహుర్తాలు కూడా ఉండటంతో ప్రస్తుతం అనేక స్టార్ హోటళ్లు ‘నో రూమ్’గా మారిపోయాయి. ఉన్న వాటిలోనూ అద్దెలు సాధారణ సమయం కంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రముఖ వెబ్సైట్లు, యాప్స్ సూచిస్తున్నాయి. గురువారం రాత్రి క్రికెట్ మ్యాచ్ ఉండటంతో మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఇవే రేట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా మామూలు రోజుల్లో కంటే వీకెండ్స్లో హోటల్ రూముల అద్దెలు ఎక్కువగా ఉంటాయి. ఈ లెక్కన చూసినా శని–ఆదివారాల్లో ఆయా హోటళ్ల అద్దెల కంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఎక్కువగా ఉన్నాయి. సైబరాబాద్ పరిధిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న షెరిటన్ హోటల్లో ప్రెసిడెన్షియల్ స్వీట్ అద్దె మంగళ–బుధవారాల్లో రూ.1.28 లక్షలుగా ఉండగా... శుక్రవారం నుంచి ఇది రూ.64 వేల నుంచి రూ.67 వేల వరకు మాత్రమే ఉన్నట్లు ఆయా వెబ్సైట్లు చూపిస్తున్నాయి. ఇదే హోటల్లో సాధారణ గది అద్దె మంగళ–బుధవారాల్లో రూ.21,500గా, శని–ఆదివారాల్లో రూ.11,250గా ఉంది. హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్ హోటల్లో మంగళ–బుధవారాలకు అద్దె రూ.32 వేలుగా చూపిస్తోంది. శని–ఆదివారాలకు ఈ మొత్తం రూ.9,800గా ఉంది. వెస్టిన్ హోటల్లో మంగళ–బుధవారాలకు రూ.22,500గా, శని–ఆదివారాలకు రూ.10 వేలుగా కనిపిస్తోంది. సోమాజీగూడలోని ది పార్క్ హోటల్లో గది అద్దె మంగళ–బుధవారాలకు రూ.11,587గా, శని–ఆదివారాలకు రూ.5,071గా ఉంది. గురు–శుక్రవారాల్లో ఆయా హోటళ్లలో నో రూమ్ అని కనిపిస్తోంది. (అద్దె మొదటి రోజు చెక్ ఇన్ సమయం నుంచి రెండో రోజు చెక్ ఔట్ సమయం వరకు... పన్నులు దీనికి అదనం) -
IPL 2024: తిరుగులేని సన్రైజర్స్.. అన్ని జట్లు ఓడినా..!
ఐపీఎల్ 2024 సీజన్లో సగానికి పైగా మ్యాచ్లు పూర్తయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ (14 పాయింట్లు), కోల్కతా నైట్రైడర్స్ (10), సన్రైజర్స్ హైదరాబాద్ (10), లక్నో సూపర్ జెయింట్స్ (10) జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. సీఎస్కే (8), గుజరాత్ (8), ముంబై ఇండియన్స్ (6), ఢిల్లీ క్యాపిటల్స్ (6) జట్లు ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ (4), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2) చివరి రెండు స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్ అశలను దాదాపుగా వదులుకున్నాయి.ప్రస్తుత సీజన్లో 39 మ్యాచ్ల అనంతరం ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల్లో సన్రైజర్స్ మినహా మిగతా తొమ్మిది జట్లు తమతమ సొంత మైదానాల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఒక్క సన్రైజర్స్ మాత్రమే హోం గ్రౌండ్లో తిరుగులేని శక్తిగా ఉంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న చెన్నై, ఆర్సీబీ, ముంబై జట్లు సైతం సొంత మైదానాల్లో ఓటములు ఎదుర్కొంటే, కమిన్స్ సేన మాత్రం సొంత అభిమానుల మధ్యలో దర్జాగా తలెత్తుకు నిలబడింది.ఈ సీజన్లో సన్రైజర్స్ కమిన్స్ నేతృత్వంలో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. పటిష్టం అంటే అట్లాంటి ఇట్లాంటి పటిష్టం కాదు. ఐపీఎల్ పునాదులు దద్దరిల్లేంత పటిష్టంగా కమిన్స్ సేన ఉంది. సన్రైజర్స్ బ్యాటింగ్ వీరులు విధ్వంసం ధాటికి పొట్టి క్రికెట్ బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. వీరి దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే మూడు సార్లు 260 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది.మరోవైపు బౌలింగ్లోనూ సన్రైజర్స్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కమిన్స్ నేతృత్వంలో సన్రైజర్స్ బౌలింగ్ విభాగంలో కూడా అదరగొడుతుంది. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ పట్టపగ్లాల్లేకుండా టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. రేపు (ఏప్రిల్ 25) జరుగబోయే మ్యాచ్లో సన్రైజర్స్ సొంత మైదానంలో ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ పరుగుల వరద పారి ఆల్టైమ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని సన్రైజర్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.ఇదే సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఏం జరిగిందో అందరం చూశాం. ఆర్సీబీ హోం గ్రౌండ్లో జరిగిన ఆ మ్యాచ్లో సన్రైజర్స్ బ్యాటర్లు పరుగుల ప్రళయం సృష్టించారు. హెడ్ (102), అభిషేక్ శర్మ (34), క్లాసెన్ (67), మార్క్రమ్ (32 నాటౌట్), అబ్దుల్ సమద్ (37 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్లతో విరుచుకుపడటంతో సన్రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ స్కోర్ (287) నమోదు చేసింది. ప్రత్యర్ది హోం గ్రౌండ్లోనే సన్రైజర్స్ బ్యాటర్లు ఈ తరహాలో రెచ్చిపోతే.. రేపు సొంత మైదానంలో వీరిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు.
Related News by category
-
ముంబైపై ఢిల్లీ పైచేయి
-
రాజస్తాన్ దర్జాగా...
లక్నో: ఈ సీజన్లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న రాజస్తాన్ రాయల్స్ అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ చేరేందుకు మరింత చేరువైంది. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో లక్నోపై గెలిచింది. తొలుత లక్నో సూపర్జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.ఆరంభంలోనే ఓపెనర్ డికాక్ (8), హిట్టర్ స్టొయినిస్ (0) వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సూపర్జెయింట్స్ను కేఎల్ రాహుల్ (48 బంతుల్లో 76; 8 ఫోర్లు, 2 సిక్స్లు), దీపక్ హుడా (31 బంతుల్లో 51; 7 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్కు 115 పరుగులు జోడించారు.మిగతావారిలో పూరన్ (11), బదోని (18 నాటౌట్), కృనాల్ పాండ్యా (15 నాటౌట్) పెద్ద స్కోర్లేమీ చేయలేదు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ రాయల్స్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.కెప్టెన్ సంజు సామ్సన్ (33 బంతుల్లో 71 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్లు), ధ్రువ్ జురేల్ (34 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అబేధ్యమైన నాలుగో వికెట్కు 121 పరుగులు జోడించి మరో ఆరు బంతులు మిగిలి ఉండగానే గెలిపించారు. స్కోరు వివరాలు లక్నో సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (బి) బౌల్ట్ 8; రాహుల్ (సి) బౌల్ట్ (బి) అవేశ్ ఖాన్ 76; స్టొయినిస్ (బి) సందీప్ 0; దీపక్ హుడా (సి) పావెల్ (బి) అశి్వన్ 50; పూరన్ (సి) బౌల్ట్ (బి) సందీప్ 11; బదోని నాటౌట్ 18; కృనాల్ నాటౌట్ 15; ఎక్స్ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–8, 2–11, 3–126, 4–150, 5–173. బౌలింగ్: బౌల్ట్ 4–0–41–1, సందీప్ 4–0–31–2, అవేశ్ ఖాన్ 4–0–42–1, అశ్విన్ 4–0–39–1, చహల్ 4–0–41–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) బిష్ణోయ్ (బి) స్టొయినిస్ 24; బట్లర్ (బి) యశ్ ఠాకూర్ 34; సామ్సన్ నాటౌట్ 71; పరాగ్ (సి) బదోని (బి) అమిత్ 14; జురేల్ నాటౌట్ 52; ఎక్స్ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–60, 2–60, 3–78. బౌలింగ్: హెన్రీ 3–0–32–0, మొహసిన్ 4–0–52–0, యశ్ ఠాకూర్ 4–0–50–1, స్టొయినిస్ 1–0–3–1, కృనాల్ 4–0–24–0, అమిత్ మిశ్రా 2–0–20–1, రవి బిష్ణోయ్ 1–0–16–0. -
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత్కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్ట్ కప్ స్టేజ్ 1 టోర్నీలో శనివారం జ్యోతి సురేఖ 3 స్వర్ణ పతకాలతో మెరిసింది. దీపికా కుమారి (2021) తర్వాత వరల్డ్ కప్లో 3 పసిడి పతకాలు గెలిచిన రెండో భారత ఆర్చర్గా సురేఖ నిలిచింది. మహిళల, మిక్స్డ్, టీమ్ ఈవెంట్లలో ఆమె అగ్రస్థానాన్ని సాధించడం విశేషం. మహిళల ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. ఇద్దరి స్కోర్లు 146–146తో సమం కాగా...షూటాఫ్ ఫినిష్తో సురేఖ పైచేయి సాధించింది. మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతిసురేఖ – అభిషేక్ వర్మ ద్వయం 158–157 స్కోరుతో లిసెల్ జాత్మా – రాబిన్ జాత్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది. మహిళల టీమ్ ఈవెంట్ తుది పోరులోలో సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత జట్టు 236–225 తేడాతో ఇటలీ జట్టుపై గెలుపొందింది.పురుషుల విభాగంలో మరో 2 పతకాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్‡్ష రజతం గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 147–150 తేడాతో నికో వీనర్ (ఆ్రస్టియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్కు బంగారం లభించింది. ఫైనల్ అభిõÙక్ వర్మ, ప్రియాన్‡్ష, ప్రథమేశ్లతో కూడిన భారత జట్టు 238–231తో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. ఈ టోర్నీ రికర్వ్ విభాగం ఫైనల్ మ్యాచ్లు ఆదివారం జరుగుతాయి. -
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
2024–25 ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్లో పాల్గొనే 14 మంది గ్రాండ్మాస్టర్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తమిళనాడు క్రీడాకారిణి ఆర్.వైశాలి భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో మొత్తం 20 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.‘ఫిడే’ నిర్దేశించిన అర్హత (ర్యాంకింగ్) ప్రకారం 14 మందికి నేరుగా చోటు దక్కగా... మిగతా ఆరుగురిని నిర్వాహకులు నామినేట్ చేస్తారు. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు (క్లాసికల్) టాన్ జోంగ్యి, అలెగ్జాండ్రా కోస్టెనిక్, మారియా ముజీచుక్ కూడా టోర్నీ బరిలో నిలిచారు. ప్రస్తుత చాంపియన్ జు వెన్జున్ ఈ ఈవెంట్నుంచి తప్పుకుంది. మహిళల చెస్ను మరింత ఆదరణ పెంచే క్రమంలో పలు మార్పులతో గ్రాండ్ప్రి సిరీస్ను ఈ సారి కొత్తగా నిర్వహించనున్నట్లు ‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుటోవ్స్కీ వెల్లడించారు. ఇటీవల జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది. -
ఆమె అసలు ఓనర్లా ఉండదు.. ఓడినా కూడా..
‘‘ఆమె ఒక అద్భుతమైన మహిళ. జట్టుతో మమేకమై పోతుంది. టీమ్ ఓడిపోయినపుడు నిరాశకు గురైనా.. తన భావోద్వేగాలను నియంత్రించుకోగల శక్తి ఆమెకు ఉంది. ఆమె గొప్ప నటి. ఎంతో అనుభవం ఉన్న, విజయవంతమైన ఆర్టిస్ట్.ప్రతి సినిమా హిట్ కాదనే విషయం ఆమెకు తెలుసు. అలాగే.. ప్రతి మ్యాచ్లోనూ గెలవలేమనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. మ్యాచ్లో ఓటమిపాలైన తర్వాత మాతో మాట్లాడుతున్నపుడు చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుంది. నేను ఆ జట్టుకు మూడేళ్ల పాటు ఆడాను. నలభై కంటే ఎక్కువ మ్యాచ్లలో భాగమయ్యాను.అయినా.. ఓడిన సందర్భాల్లో కేవలం రెండు- మూడుసార్లు మాత్రమే ఆమె మా మీద కోపం చూపించింది. మిగతా సందర్బాల్లో అసలు ఏమీ అనలేదు’’ అని టీమిండియా మాజీ ఆల్రౌండర్, పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన ఇర్ఫాన్ పఠాన్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని.. ఓటమిపాలైనప్పుడు కూడా జట్టుకు ఆమె మద్దతుగానే ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.తన చేత్తో పరాఠాలు చేసి పెట్టిందిఅదే విధంగా కీలక మ్యాచ్లో గెలిస్తే గనుక ప్రీతి సంతోషానికి అవధులు ఉండవని.. అలాంటి సమయంలో తానే స్వయంగా వంట చేసి అందరికీ వడ్డిస్తుందని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాలో తాము చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించినపుడు ప్రీతి జింటా స్వయంగా తన చేత్తో 40 పరాఠాలు చేసి తమకు అందించిందని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.ఫ్రాంఛైజీ జట్ల యజమానుల్లో ప్రీతి జింటా వేరే లెవల్ అంటూ ప్రశంసించాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ విధించిన 261 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి చరిత్ర సృష్టించింది.దుమ్ములేపిన బెయిర్స్టో, శశాంక్జానీ బెయిర్స్టో విధ్వంసకర శతకానికి తోడు శశాంక్ సింగ్ కూడా దంచి కొట్టడంతో ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్ను చిత్తు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా గురించి గుర్తు చేసుకుంటూ ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.🎥 Ruthless Hitting 💥Will #PBKS get this over the line? 🤔83 runs required from 42 deliveries‼️Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/MvCvQQxmoe— IndianPremierLeague (@IPL) April 26, 2024చదవండి: రోహిత్, స్కై కాదు!.. వరల్డ్కప్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టేది ఇతడే: యువీ
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- sreemukhi: ఖతర్నాక్ అందాలతో కవ్విస్తోన్న అందాల యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- TCSS ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement