‘పోటు’ పెరుగుతుంది! | Sakshi
Sakshi News home page

‘పోటు’ పెరుగుతుంది!

Published Mon, Mar 21 2016 12:12 AM

TV Sets in Gujranwala Hospitals Removed Before High Octane India-Pakistan World T20 Game

అసలే హార్ట్ పేషంట్లు.. ఆపై భారత్-పాక్ మ్యాచ్.. ఇంకేముంది... ఈ మ్యాచ్ గనుక చూస్తే పేషంట్ల పోటు పెరగడం ఖాయమని పాకిస్తాన్‌లోని గుజ్రాన్‌వాలాలోని ఆసుపత్రులు బాగా గ్రహించినట్లున్నాయి. వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలలోని కార్డియో వార్డుల్లో ఉన్న టీవీ సెట్లను తొలగించాలని నిర్వాహకులు ఓ ఆర్డర్ జారీ చేశారు.

డాక్టర్లు, శస్త్రచికిత్స నిపుణుల సూచన మేరకు ఈ నిర్ణయాన్ని గుజ్రాన్‌వాలాప్రభుత్వ ఆసుపత్రి నుంచి మొదలుపెట్టారు. తర్వాత అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు విస్తరించామని సీనియర్  డాక్టర్ మతీన్ తెలిపారు.

Advertisement
Advertisement