రెండు రోజులు ఎంజాయ్‌! | Sakshi
Sakshi News home page

రెండు రోజులు ఎంజాయ్‌!

Published Tue, Jun 18 2019 5:51 AM

Two days vacation for Indian cricketers - Sakshi

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో అజేయంగా సాగుతున్న భారత క్రికెట్‌ జట్టు కాస్త సేదతీరాలని నిర్ణయించుకుంది. ఆటగాళ్లకు రెండు రోజుల పాటు విరామం ఇవ్వాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. ఈ రెండు రోజుల్లో క్రికెటర్లకు ప్రాక్టీస్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. ఆదివారం పాక్‌పై అద్భుత విజయం తర్వాత టీమిండియాలో జోష్‌ వెల్లువెత్తుతుండగా... ఆటగాళ్లంతా విరామంలో సరదాగా గడిపేందుకు సిద్ధమయ్యారు. భారత్‌ తమ తర్వాతి మ్యాచ్‌లో ఈ నెల 22న అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది. మరోవైపు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించిన భారత జట్టుకు ఇంగ్లండ్‌లోని విఖ్యాత ఫుట్‌బాల్‌ క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌ (ఎంయూ) శుభాకాంక్షలు తెలిపింది. మ్యాచ్‌కు ముందు పలువురు భారత ఆటగాళ్లు మాంచెస్టర్‌లోని ఎంయూ స్టేడియాన్ని సందర్శించారు.   
 

Advertisement
Advertisement