38 ఏళ్ల తరువాత విరాట్ సేన | Sakshi
Sakshi News home page

38 ఏళ్ల తరువాత విరాట్ సేన

Published Mon, Dec 19 2016 12:39 PM

38 ఏళ్ల తరువాత విరాట్ సేన

చెన్నై:విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా అరుదైన ఫీట్ను సాధించింది. ఈ సిరీస్ ఐదో టెస్టులో కరుణ్ నాయర్ సెంచరీ సాధించడం ద్వారా ఒక మైలురాయిని నమోదు చేసింది. ఇంగ్లండ్ తో సిరీస్లో భాగంగా చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఆటగాడు కరుణ్ నాయర్ శతకం నమోదు చేశాడు. తద్వారా ఈ సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు సాధించి అరుదైన రికార్డు  సాధించారు.
 

ఇదే తరహాలో ఒక సిరీస్ లో ఆరుగురు భారత ఆటగాళ్లు వ్యక్తిగత సెంచరీలను నమోదు చేయడం  1978-79 సీజన్ తరువాత ఇదే తొలిసారి. చివరిసారి స్వదేశంలో వెస్టిండీస్పై భారత్ ఆ ఘనత సాధించింది. ఆ తరువాత ఇంతకాలానికి సిరీస్లో ఆరుగురు భారత ఆటగాళ్లు సెంచరీలను నమోదు చేశారు. ఇలా ఆరుగురు భారత ప్లేయర్లు సెంచరీలను చేయడం ఇది నాల్గోసారి మాత్రమే.

 
ఈ మ్యాచ్లో నాయర్ సెంచరీ చేయగా, కేఎల్ రాహుల్ కూడా శతకం సాధించాడు. అంతకుముందు మురళీ విజయ్, విరాట్ కోహ్లి, జయంత్ యాదవ్, పూజారాలు శతకాలు చేసిన వారిలో ఉన్నారు. కాగా, ఈ సిరీస్లో భారత జట్టు ఇప్పటివరకూ  ఎనిమిది శతకాలను సాధించడం మరో విశేషం. ఇందులో విరాట్ కోహ్లి, మురళీ విజయ్లు చెరో రెండు సెంచరీలు చేయగా, పూజారా, జయంత్ యాదవ్, నాయర్, కేఎల్ రాహుల్లు తలో ఒక సెంచరీ సాధించారు.



 

Advertisement
Advertisement