డర్బన్: భారత క్రికెట్ జట్టులో పరుగుల మెషీన్గా పేరుగాంచిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ, దక్షిణాఫ్రికా గడ్డపై మాత్రం తొలి వన్డే సెంచరీని మాత్రం ఇటీవల సాధించాడు. ఆరు వన్డేల సిరీస్లో భాగంగా డర్బన్లో జరిగిన తొలి వన్డేలో కోహ్లి శతకం సాధించాడు. దాంతో వన్డే కెరీర్లో 33వ సెంచరీని నమోదు చేశాడు. అయితే సఫారీ జట్టుపై సెంచరీ తర్వాత కోహ్లి కాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ముందు ఒక చేతిని కిందికి కొట్టి మరీ సెంచరీ సంబరాలు చేసుకున్నాడు. దీనిపై తాజాగా కోహ్లి వివరణ ఇచ్చాడు.
' సఫారీ గడ్డపై ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్. ఇంతకుముందు ఇక్కడ ఎప్పుడూ వన్డే సెంచరీ చేయలేదు. అందుకే ఆ తరహాలో సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం. జోహన్నెస్బర్గ్లో విజయం సాధించిన ఆత్మవిశ్వాసం ఇక్కడ కూడా బాగా పని చేసింది. అజింక్యా రహానే నుంచి నాకు మంచి సహకారం లభించింది. రహానే నిలకడగా ఆడి చక్కటి భాగస్వామ్యాన్ని సాధించడానికి కారణమయ్యాడు. గేమ్ను అర్దం చేసుకుంటూ ఇద్దరం ఇన్నింగ్స్ను నడిపించాం. దాంతో గెలుపు సునాయాసమైంది' అని కోహ్లి పేర్కొన్నాడు.