ధోని కూతురు ఏం చెప్పింది.. | Sakshi
Sakshi News home page

ధోని కూతురు ఏం చెప్పింది..

Published Mon, Oct 9 2017 9:20 AM

 Virat Kohli's Reunion With MS Dhoni's Daughter Ziva - Sakshi

సాక్షి, రాంచీ: ఆస్ట్రేలియాపై తొలి టీ20 విజయాన్ని టీమిండియా సరదాగా గడుపుతూ ఆస్వాదిస్తుంది. ఈ మ్యాచ్‌ అనంతరం కోహ్లి సేన రాంచీలోని మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని ఇంటిని సందర్శించింది. ఈ సందర్భంగా ధోని కూతురు జీవాతో టీమిండియా సభ్యులు సరదాగా గడిపారు. చిన్నపిల్లలంటే విపరీతంగా ఇష్టపడే కెప్టెన్‌ కోహ్లి అయితే జీవాతో మరింత ఎక్కువసేపు ఆడుకుంటూ ముచ్చటించారు. ముద్దు ముద్దుగా మాట్లాడే జీవాను పలకిరిస్తూ తీసిన వీడియోను కోహ్లి సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

‘మేము అందరం జీవాను కలిశాం. స్వచ్ఛమైన అమాయకత్వం గల జీవా ఆశీర్వాదం తీసుకున్నామని’ కోహ్లి ట్విట్‌ చేశాడు. ఇక ఈ వీడియోలో కోహ్లి జీవాను మీ ఇంట్లో ఎన్ని కుక్కలున్నాయి అని అడగ్గా.. ధోని 6 ఉన్నాయి అని చెప్పు అనగా జీవా మియావ్‌..మియావ్‌..అనడంతో కోహ్లి కూడా ఆ చిన్నారిని అనుకరిస్తు నవ్వాడు. దీంతో అక్కడ నవ్వులు పూసాయి. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్‌ అయింది. ధోని, కోహ్లి అభిమానులు సూపర్‌, వావ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక గతంలో కూడా జీవాతో సెల్ఫీ దిగిన ఫోటోను కోహ్లి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఇక తొలి టీ20లో డక్‌వర్త్‌ లూయిస్‌తో భారత్‌ ఆసీస్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.


 

Advertisement
Advertisement