వీవీఎస్.. వర్షం కోసం ప్రార్ధించావా? | Sakshi
Sakshi News home page

వీవీఎస్.. వర్షం కోసం ప్రార్ధించావా?

Published Thu, May 18 2017 8:03 PM

వీవీఎస్.. వర్షం కోసం ప్రార్ధించావా?

హైదరాబాద్: తనకు అవకాశం వస్తే ట్వీట్ చేయడానికి మాజీ సహచరులు సచిన్, ద్రవిడ్, గంగూలీ ఇలా ఎవరిని  వదలడు వీరేంద్ర సెహ్వాగ్. ప్రతి విషయంపై వ్యంగ్యంగా ట్వీట్ చేసే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ సారి మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పై చలోక్తులు విసురుతూ ట్వీట్ చేశాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మెంటర్ లక్ష్మణ్ ను కోల్ కతా తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో భారీ వర్షం కోసం దేవున్ని ప్రార్ధించావా? అంటూ సరదాగా సెటైర్లు వేశాడు. కానీ మాకు మాత్రం మ్యాచ్ కావాలి అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 7 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే సన్ రైజర్స్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం పడటంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల పట్టికలో ముందున్న సన్ రైజర్స్ క్వాలిఫయర్-2 ఆడే అవకాశం దక్కేది.  దీన్ని టార్గెట్ చేస్తూ ఇటీవల లక్ష్మణ్ తిరుమల లో పూజలు జరిపిన ఫోటోను షేర్ చేశాడు మన వీరూ బాబు.

Laxman ji spotted praying for torrential rains in Bangalore. But we need a game.#SRHvKKR pic.twitter.com/GamAd94uPt

Advertisement
Advertisement