ఫించ్‌ స్థానంలో సెహ్వాగ్‌? | Sakshi
Sakshi News home page

ఫించ్‌ స్థానంలో సెహ్వాగ్‌?

Published Sun, Apr 1 2018 2:53 PM

Virender Sehwag to play for Kings Punjab? - Sakshi

మొహాలీ: క్రికెట్‌కు వీరేంద్ర సెహ్వాగ్‌ గుడ్‌ బై చెప్పి చాలా కాలమే అయ్యింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ప్రస్తుతం కింగ్స్‌ పంజాబ్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా, క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌గా సెహ్వాగ్‌ కొనసాగుతున్నాడు. అయితే కింగ్స్‌ పంజాబ్‌ తరపున సెహ్వాగ్‌ మళ్లీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడట. ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌ స్థానంలో సెహ్వాగ్‌ బరిలోకి దిగుతున్నాడట. ఇది కింగ్స్‌ పంజాబ్‌ తాజాగా చేసిన ట్వీట్‌. అయితే ఇదంతా నిజం కాదు. ఏప్రిల్‌ 1వ తేదీ సందర్భంగా ఫ్యాన్స్‌ను ఆట పట్టించడానికి చేసిన ట్వీట్‌.

ఇదిలా ఉంచితే, కాసేపటికే కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా మరో ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అతను మళ్లీ ఆడితే చూడాలని ఉంది అంటూ యువీ ట్వీట్‌ చేశాడు.  ఇది మాత్రం ఫ్యాన్స్‌ను ఆలోచనలో పడేసింది. సెహ్వాగ్‌ ప్రాక్టీస్‌ చేయడమేమిటని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సెహ్వాగ్‌ మరొకసారి క్రికెట్‌ ఫీల్డ్‌లోకి అడుగుపెడితే చూడాలనుకునే వారు కూడా ఉన్నారు.

Advertisement
Advertisement