ఆనంద్కు రెండో విజయం | Sakshi
Sakshi News home page

ఆనంద్కు రెండో విజయం

Published Sun, Oct 2 2016 2:27 AM

ఆనంద్కు రెండో విజయం

మాస్కో: తాల్ స్మారక అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ రెండో విజయాన్ని నమోదు చేశాడు. బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)తో శనివారం జరిగిన ఐదో రౌండ్‌లో ఆనంద్ 58 ఎత్తుల్లో గెలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ మూడు పారుుంట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్‌లో ఆనంద్ 41 ఎత్తుల్లో వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు.

Advertisement
Advertisement