ఫుట్బాల్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: స్కైకింగ్స్ 5-ఎ-సైడ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో వీవీ నగర్ ఎఫ్సీ జట్టు రన్నరప్తో సరిపెట్టుకుంది. బోయిన్పల్లి గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన ఫైనల్లో పుణే కస్టమ్స్ జట్టు... వీవీ నగర్పై గెలిచింది. హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు నిర్ణీత సమయం ముగిసే సరికి గోల్స్ చేయలేదు. పెనాల్టీ షూటౌట్లోనూ ఇరు జట్లు 5-5తో సమంగా నిలిచాయి. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు టాస్ వేయగా పుణే గెలిచింది.
అనంతరం నిర్వాహకులు విజేత పుణేకు రూ. 50 వేల నగదు, రన్నరప్ వీవీ నగర్ జట్టుకు రూ. 25 వేల నగదు బహుమతి అందజేశారు. అనూజ్ (వీవీ నగర్)కు బెస్ట్ ప్లేయర్, రాజ్ గురు (పుణే)కు బెస్ట్ గోల్ కీపర్ అవార్డులు దక్కాయి. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో పుణే కస్టమ్స్ 3-1తో యునెటైడ్ ఎఫ్సీపై, వీవీ నగర్ 3-0తో ప్రొ హార్ట్ ఫూజన్పై విజయం సాధించాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో 42 జట్లు తలపడ్డాయి. ఒక్కో మ్యాచ్ను 20 నిమిషాల చొప్పున నిర్వహించారు.