'ఓపెన్ గ్రౌండ్ లో ఉండడంతో బయటపడ్డాం' | Sakshi
Sakshi News home page

'ఓపెన్ గ్రౌండ్ లో ఉండడంతో బయటపడ్డాం'

Published Sun, Apr 26 2015 6:28 PM

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో విలేకరులతో మాట్లాడుతున్న కోచ్ మేమొల్ రాకీ - Sakshi

న్యూఢిల్లీ: నేపాల్ లో సంభవించిన భూకంపంతో భయకంపితులమయ్యామని భారత ఫుట్ బాల్-14 క్రీడాకారిణి సోని కుమారి తెలిపారు. భూ విలయంతో విలవిల్లాడామని, అందరం కలిసి ఏడ్చాచేశామని వెల్లడించింది. తాము మ్యాచ్ ఆడడానికి కఠ్మాండు వెళ్లినట్టు తెలిపింది.

కఠ్మాండులో చిక్కుకున్న ఫుట్ బాల్ అండర్-14 టీమ్ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. తామంతా స్టేడియంలో ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డామని హెడ్ కోచ్ మేమొల్ రాకీ తెలిపారు. ఓపెన్ గ్రౌండ్ లో ఉండడం మంచిదయిందని, పిల్లలు మాత్రం భయపడ్డారని చెప్పారు.

Advertisement
Advertisement