టీమిండియా వైదొలిగితే భారీ నష్టం | Sakshi
Sakshi News home page

టీమిండియా వైదొలిగితే భారీ నష్టం

Published Fri, May 5 2017 5:00 PM

టీమిండియా వైదొలిగితే భారీ నష్టం

బెంగళూరు: చాంపియన్స్‌ ట్రోఫి నుంచి టీమిండియా వైదొలిగితే భారీ నష్టం ఏర్పడుతుందని దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీం ఆమ్లా, డేవిడ్‌ మిల్లర్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే భారత్‌లో అత్యధికమంది క్రికెట్‌ అభిమానులున్నారని, ఈ టోర్నీలో భారత్‌ ఆడకపోతే ఆదరణ తగ్గుందని, భారీ నష్టం తప్పదని చెప్పారు.

చాంపియన్స్‌ ట్రోఫీలో టాప్‌-8 జట్లు ఆడితేనే ఆసక్తిగా ఉంటుందని మిల్లర్, ఆమ్లా అభిప్రాయపడ్డారు. భారత్‌ రాకుంటే ఆ జట్టు స్థానంలో ఎవరు ఆడుతారన్న విషయం తనకు తెలియదని చెప్పారు. దీనివెనుక రాజకీయాల గురించి తమకు తెలియదన్నారు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లను గత నెల 25వ తేదీ లోపు ప్రకటించాల్సివుండగా.. బీసీసీఐ గడువులోపు జట్టును ఎంపిక చేయలేదు. దీంతో ఈ టోర్నీలో భారత్‌ పాల్గొనడంపై సందేహాలు వచ్చాయి. ఐసీసీ, బీసీసీఐ మధ్య విభేదాలే ఇందుకు కారణమన్న వాదనలు తెరపైకి వచ్చాయి.

Advertisement
Advertisement