నన్ను గానీ కొట్టవు కదా: నరేంద్ర మోదీ | Sakshi
Sakshi News home page

నన్ను గానీ కొట్టవు కదా: నరేంద్ర మోదీ

Published Mon, Aug 29 2016 8:47 AM

నన్ను గానీ కొట్టవు కదా: నరేంద్ర మోదీ - Sakshi

సాక్షి మాలిక్ రియో ఒలింపిక్స్‌లో దేశానికి తొలి పతకం అందించినప్పటి నుంచి ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న మాటలను మాత్రం తాను మర్చిపోలేనని సాక్షి అంటోంది. సోమవారం రాష్ట్రపతి చేతుల మీదుగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకోవడానికి ఒక్క రోజు ముందు.. ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా కలిసింది. అప్పుడాయన.. ''ఇప్పుడు నన్ను గానీ కొట్టవు కదా'' అని సరదాగా అన్నారట. ఈ విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత సాక్షి మాలిక్ మీడియాకు చెప్పింది. ప్రధాని మీతో ఏం మాట్లాడారని అడిగినప్పుడు ఈ విషయం వెల్లడించింది. అప్పుడు మీ సమాధానం ఏంటని అడిగితే.. ''సర్, నేను మ్యాట్ మీద ఉన్నప్పుడు మాత్రమే రెజ్లర్‌ని. బయటకు వచ్చాక మామూలు ఆడపిల్లనే'' అని సమాధానం ఇచ్చినట్లు తెలిపింది.
 

Advertisement
Advertisement