సచిన్‌తో డిన్నర్ @ రూ.1.45 లక్షలు | Sakshi
Sakshi News home page

సచిన్‌తో డిన్నర్ @ రూ.1.45 లక్షలు

Published Thu, Feb 19 2015 12:48 AM

world cup 2015

 మెల్‌బోర్న్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి భోజనం చేయాలనుకుంటున్నారా..? అయితే ఇందుకోసం భారీగానే ఖర్చు చేయాలి మరి.. కానీ ఇలాంటి అరుదైన ఆతిథ్యం అందరికీ అందుబాటులో ఉండదు.. కేవలం 60 మంది వీఐపీలకు మాత్రమే ఆ అదృష్టం దక్కనుంది. ఈనెల 22న భారత్, దక్షిణాఫ్రికా వన్డేను వీక్షించేందుకు సచిన్ ఆస్ట్రేలియాకు రానున్నాడు. 26న రాత్రి ఈ విందు జరుగుతుంది. దీని ఖరీదు 1,500 (రూ.48 వేలు) నుంచి 3 వేల (రూ.లక్షా 45 వేలు) ఆసీస్ డాలర్లుగా నిర్ణయించారు. ‘ఈ విందుకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదేమీ ఈవెంట్ కాకపోయినా క్రికెట్ లెజెండ్‌తో ప్రత్యేక విందు కావడంతో అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఎనిమిది మందికి కలిసి ఒక్కో టేబుల్ ఉంటుంది. వీరికి భోజనం, ఖరీదైన మందును సర్వ్ చేస్తారు. అలాగే 3వేల ఆసీస్ డాలర్లు పెట్టగలిగితే సచిన్‌తో అరగంట సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఈ విందుకు వచ్చినవారిని సచిన్‌కు పరియడం చేయడమే కాకుండా వారు ఇంటర్వ్యూ తీసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం’ అని నిర్వాహకులు తెలిపారు. ఈ విందుతో వచ్చిన మొత్తం సచిన్ ఫౌండేషన్‌కు వెళుతుంది.
 

Advertisement
Advertisement