యువీపై ధావన్ ప్రశంసలు | Sakshi
Sakshi News home page

యువీపై ధావన్ ప్రశంసలు

Published Mon, May 9 2016 12:59 PM

యువీపై ధావన్ ప్రశంసలు - Sakshi

విశాఖ:ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆడుతున్న స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్పై సహచర ఆటగాడు శిఖర్ ధావన్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో తన మిత్రుడు యువీకి ప్రత్యేక స్థానం ఉందంటూ కొనియాడాడు. యువీ క్రీజ్లో కుదురుకుంటే మ్యాచ్ స్వరూపాన్ని కొన్ని నిమిషాల్లోనే మార్చేస్తాడని ధావన్ ప్రశంసించాడు. ఇన్నింగ్స్లో కొన్ని బంతులు మాత్రమే ఆడినా మ్యాచ్ ను టర్న్ చేసే శక్తి యువీ సొంతమన్నాడు.

ఆదివారం విశాఖలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 85 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో శిఖర్ 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో అజేయంగా 82 పరుగులు చేయగా, యువరాజ్ సింగ్ 3 ఫోర్లు,2 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. 

మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ..యువీ ఒక అసాధారణ ఆటగాడని ప్రశంసించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, ఓవరాల్గా జట్టు మాత్రం  సమతుల్యంగా ఉందన్నాడు. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ సన్ రైజర్స్ అంచనాలను అందుకుంటూ విజయాలను నమోదు చేస్తుందన్నాడు. తాను ఎంతవరకూ ఆటకు న్యాయం చేయగలనే అనే విషయం తనకు తెలుసని శిఖర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్-9వ సీజన్ ఆదిలో శిఖర్ తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. తొలి మూడు మ్యాచ్ ల్లో 8,6, 2 పరుగులు చేసి పెవిలియన్ కు చేరిన శిఖర్.. ఆ తరువాత 53, 45, 56, 11, 47, 82 పరుగులు నమోదు చేశాడు.

 

Advertisement
Advertisement