బర్మింగ్హోమ్:భారత వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకోబోతున్నాడు. కేవలం కొంతమందికి మాత్రమే సాధ్యమైన 300 వన్డేల మార్కును చేరేందుకు యువీకి కేవలం అడుగుదూరంలో నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీలో గురువారం బంగ్లాదేశ్ జరుగనున్న వన్డే మ్యాచ్ ద్వారా ఆ ఘనతను సాధించబోతున్నాడు. భారత తరపున కేవలం నలుగురు ఆటగాళ్లు మాత్రమే మూడొందల వన్డేలను ఆడగా, వారి సరసన యువీ చేరనున్నాడు. అంతకుముందు భారత మాజీ క్రికెటర్లు మొహ్మద్ అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లు మాత్రమే మూడొందల మార్కును చేరిన వారిలో ఉన్నారు.
2000వ సంవత్సరంలో కెన్యాతో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన యువీ.. 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో తనదైన మార్కును చూపెడుతూ భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2007లో భారత జట్టు మినీ వరల్డ్ కప్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించిన యువీ.. 2011 వన్డే వరల్డ్ కప్ లో్ కూడా సత్తా చాటి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలుచుకున్నాడు. మరొకవైపు 2002లో ఇంగ్లండ్ తో జరిగిన నాట్వెస్ట్ ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో యువీ ముఖ్య భూమిక పోషించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే భారత్కు ఎన్నో మధురమైన విజయాల్ని అందించిన ఘనత యువీది. మరో రెండు రోజుల్లో మూడొందల వన్డే ఆడబోతున్న యువీ ఆ మ్యాచ్ ను మరుపురాని జ్ఞాపకంగా ఉంచుకుంటాడని ఆశిద్దాం.
యువరాజ్@300!
Published Tue, Jun 13 2017 3:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement