హరారే: జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు తొలి షాక్ తగిలింది. మూడు టీ 20ల సిరీస్లో భాగంగా ఇక్కడ శనివారం జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. జింబాబ్వే విసిరిన 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ధోని సేన రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్ లో భారత విజయానికి ఎనిమిది పరుగులు చేయాల్సిన తరుణంలో మ్యాచ్ ఫినిషర్ గా పేరున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సింగిల్స్ కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ తొలి బంతికి ధోని సింగిల్ తీయగా, ఆ తరువాత బంతికి అక్షర్ పటేల్ అవుటయ్యాడు. మూడో బంతికి సింగిల్ ధోని మరో సింగిల్ తీయగా, నాల్గో బంతికి రిషి ధవన్ పరుగేమీ చేయలేదు. ఐదో బంతి వైడ్ కావడంతో భారత్ కు ఒక పరుగు వచ్చింది. ఆ తరువాత ధవన్ సింగిల్ తీసి ధోనికి స్ట్రైయికింగ్ ఇచ్చాడు. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో ధోని సింగిల్ తో సరిపెట్టుకున్నాడు. దీంతో భారత్ జట్టుకు ఓటమి తప్పలేదు.
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తరువాత అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మన్ దీప్ సింగ్(31;27 బంతుల్లో 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా, అంబటి రాయుడు(19) విఫలమయ్యాడు. దీంతో భారత జట్టు 54 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మనీష్ పాండే(48;35 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. అయితే మరో ఎండ్ లో అతనికి సరైన సహకారం లభించకపోవడంతో భారత్ కు ఓటమి తప్పలేదు. భారత మిగతా ఆటగాళ్లలో కేదర్ జాదవ్(19), కెప్టెన్ మహేంద్ర సింగ్(19 నాటౌట్)లు నిరాశపరిచారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.
జింబాబ్వే ఆటగాళ్లలో చిబాబా(20), మసకద్జా(25)లు మోస్తరుగా రాణించగా, ముతాంబామి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ కు చేరాడు. ఆ తరువాత సికిందర్ రాజా(20), వాలర్(30)లు ఫర్వాలేదనిపించారు. ఈ జోడీ మూడో వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది. అయితే చిగుంబరా (55 నాటౌట్; 26 బంతుల్లో 1 ఫోర్, 7 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. టీమిండియా బౌలర్లలో బూమ్రా రెండు వికెట్లు సాధించగా, రిషి ధవన్, అక్షర్ పటేల్, చాహల్ లకు తలోవికెట్ దక్కింది.
ధోని సేనకు షాక్
Published Sat, Jun 18 2016 8:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement