రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

Published Sun, Sep 8 2013 3:08 AM

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ నైనిటాల్ డిస్ట్రిక్ట్‌లో శనివారం తెల్లవారుజామున ఓ కారు అదుపు తప్పి నదిలో పడింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు మరణించారు. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నోయిడా వాసి దీపక్ కథూరియా కుటుంబసభ్యులు వస్తున్న కారు హల్దావాని-పితోర్‌గఢ్ హైవే మార్గంలో గరమ్‌పాని వద్ద అదుపుతప్పి శిప్రా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో జ్యోతి కథూరియా, ఆమె ఇద్దరు పిల్లలు రష్మీ (6), క్రిష్ (11) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన దీపక్ ఖైర్నాలోని కమ్యూనిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు.    

Advertisement
Advertisement