ట్రాక్టర్‌ బోల్తా: ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా: ఇద్దరి మృతి

Published Thu, Feb 16 2017 12:46 PM

2 died in road accident at east godavari district

చింతూరు: వేగంగా వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సరివెల శివారులో గురువారం చోటు చేసుకుంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల చెర్ల మండలం పుదునూరు గ్రామానికి చెందిన రాంబాబు(50), సర్వేల్‌ గ్రామానికి చెందిన వెంకయ్య(25)ట్రాక్టర్‌పై సరివెల నుంచి వంకగూడెం వెళ్తుండగా ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 

Advertisement
Advertisement