వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

Published Thu, Apr 27 2017 11:52 AM

2 died in road accident in nalgonda district

మిర్యాలగూడ/మెట్‌పల్లి: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందిన సంఘటనలు గురువారం వెలుగుచూశాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వేగంగా వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట వద్ద వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తప్పక చదవండి

Advertisement