రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థుల మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థుల మృతి

Published Sat, Mar 18 2017 11:28 AM

2 inter students died in road accident at warangal district

ఖాజీపేట: వరంగల్‌ జిల్లా హన‍్మకొండ మండలం నక‍్కలగుట‍్ట వద‍్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద‍్దరు ఇంటర్‌ విద్యార్థులు దుర‍్మరణం చెందారు. ఇంటర్‌ మొదటి సంవత‍్సం పరీక్షలు అయిపోవడంతో బాలసముద్రం గ్రామానికి చెందిన నవీన్‌, సుమంత్‌ అనే విద్యార్థులు ఇంటికి వెళుతుండగా నక‍్కలగుట‍్ట వద‍్ద జెఎంజె స్కూల్‌ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమమాదంలో ఇద‍్దరు విద్యార్థులు మృతి చెందారు. నవీన్‌ సంఘటన స‍్థలంలోనే మృతిచెందగా సుమంత్‌ ఆస‍్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement