జగిత్యాల జిల్లాలో విషాదం | Sakshi
Sakshi News home page

జగిత్యాల జిల్లాలో విషాదం

Published Wed, Jan 11 2017 2:23 PM

జగిత్యాల జిల్లాలో విషాదం - Sakshi

జగిత్యాల: జగిత్యాల జిల్లా కొడిమెల మండలం నల‍్లగొండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర‍్మరణం చెందారు. వేములవాడకు చెందిన కిషణ్‌రెడ్డి, శ్రీవాణి, పద‍్మ ద‍్విచక్రవాహనంపై జగిత్యాలకు వస‍్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ముగ్గురూ అక‍్కడికక‍్కడే మృతి చెందారు. ప్రమాదాన‍్ని గమనించిన నల‍్లగొండ గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స‍్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార‍్టం నిమిత‍్తం ఆస‍్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస‍్తున్నారు.

Advertisement
Advertisement