ఎలుగుబంటి దాడి: నలుగురికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటి దాడి: నలుగురికి గాయాలు

Published Fri, Apr 21 2017 11:34 AM

4 injured in bear attack in kurnool district

కొత్తపల్లి: ఎలుగుబంటి దాడిలో నలుగురికి గాయాలైన సంఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ శివారులోని అడవుల్లో నుంచి ఇళ్లలోకి వచ్చిన ఎలుగు బంటి అడ్డొచ్చినవారిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కావడంతో.. వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఓ ఇంట్లో దూరిన ఎలుగుబంటిని స్థానికులు నిర్బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. క్షతగాత్రుల్లో ఓ మహిళ కూడా ఉంది. 

Advertisement
Advertisement