Sakshi News home page

పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు

Published Thu, Nov 24 2016 11:07 AM

4 injured in road accident at west godavari district

- నలుగురికి గాయాలు
ఉంగుటూరు: వేగంగా వెళ్తున్న కారు ముందు టైరు పేలడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలో గురువారం చోటు చేసుకుంది. భువనేశ్వర్ నుంచి తిరువూర్ వెళ్తున్న కారు నాచుగుంట రేవు వద్దకు చేరుకోగానే కారు టైరు పేలడంతో.. అదుపుతప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించించారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీస్తున్నారు. 

Advertisement

What’s your opinion

Advertisement