తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Published Fri, Apr 3 2015 8:00 AM

9 members died in a road accident on friday

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున దిండిగల్ సమీపంలో లారీ- వ్యాన్ ఢీకొన్న దుర్ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 20మంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. రెండు కుటుంబాలు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement