పాపం.. రేప్ చేసి, అమ్మేశాడు | Sakshi
Sakshi News home page

పాపం.. రేప్ చేసి, అమ్మేశాడు

Published Sat, Feb 4 2017 5:24 PM

పాపం.. రేప్ చేసి, అమ్మేశాడు - Sakshi

న్యూఢిల్లీ: చత్తీస్గఢ్‌కు చెందిన ఓ బాలిక (15) పొరపాటుగా మరో రైలు ఎక్కడం ఆమె జీవితాన్ని నాశనం చేసింది. ఓ దుండగుడు ఓ మహిళ సాయంతో ఈ అమ్మాయిపై లైంగికదాడి చేసి, 70 వేల రూపాయలకు మరో వ్యక్తి అమ్మేశాడు. ఢిల్లీ పోలీసులు ఈ అమ్మాయిని రక్షించి విముక్తి కల్పించారు.

గత అక్టోబర్‌లో బాధిత బాలిక తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయల్దేరింది. కాగా పొరపాటుగా మరో రైలు ఎక్కడంతో ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆ అమ్మాయి అర్మాన్‌ అనే అతణ్ని కలసి తన పరిస్థితిని వివరించింది. సాయం చేస్తానని మాయమాటలు చెప్పి, అర్మాన్‌ ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. తన భార్య హసీనా సాయంతో ఆ అమ్మాయిపై దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరూ కలసి బాధితురాలిని పప్పు యాదవ్‌ అనే వ్యక్తిని అమ్మేశారు. ఆ తర్వాత పప్పు యాదవ్‌​ ఆ అ‍మ్మాయిని రెండు నెలల పాటు శారీరకంగా, మానసికంగా హింసించాడు.

అతని బారినుంచి తప్పించుకుని వచ్చిన బాధితురాలి హజ్రత్‌ నిజాముద్దీన్‌ రైల్వే స్టేషన్‌ చేరింది. అక్కడ హసీనా ఈ అమ్మాయిని గుర్తించి మత్తుమందు కలిపిన డ్రింక్‌ ఇచ్చింది. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక, మహ్మద్‌ అఫ్రాజ్‌ అనే వ్యక్తికి అప్పగించింది. అఫ్రాజ్‌ ఈ అమ్మాయిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపదలో ఉన్న ఈ అమ్మాయిని గుర్తించిన ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. బాధితురాలిని రక్షించి, సన్‌లైట్‌ కాలనీ పోలీస్‌ స్టేషన్‌లో నిందితులపై కేసు నమోదు చేశారు. అఫ్రాజ్‌, పప్పు యాదవ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి, మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement